BRS |టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ బెహ్రాన్ శాఖ కార్యవర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారతదేశ ప్రగతిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పడం శుభపరిణామని టీఆర్ఎస్ ఎన్నారై బెహ్రాన్ అధ్యక్షులు రాధారపు సతీశ్ కుమార్ అన్నారు. ఇవాళ బెహరాన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధి , పేదలకు అందుతున్న సంక్షేమ ఫలాలపై దేశమంతా చర్చిస్తుందని పేర్కొన్నారు. మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్లకు కోట్లు తెచ్చేలా పేదలు ఆకలితో మగ్గేలా ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్ తోనే సాధ్యం అవుతుందని తెలిపారు.
ఇప్పుడున్న దేశ పరిస్థితుల్లో కేసీఆర్ వంటి గొప్ప విజన్ కలిగిన నేత దేశానికి ఎంతో అవసరమున్నది వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్ , కార్యదర్శులు సంగేపు దేవన్న , చెంన్సమనేని రాజేందర్ , ఉత్కం కిరణ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.