హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ ఆస్ర్టేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 35 సంవత్సరాల్లో జానారెడ్డి చేయలేని పనులను, నోముల నరసింహయ్య కేవలం రెండేళ్లలోనే చేసి చూపించారు అని తెలిపారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే భగత్ను గెలిపిస్తాయన్నారు. అబద్ధపు ప్రచారాలు చేసిన వారికి ఈ ఎన్నికలో బుద్ధి చెప్పాలన్నారు. భారీ సంఖ్యలో పోలింగ్లో పాల్గొని భగత్ను గెలిపించాలని కాసర్ల నాగేందర్ రెడ్డి ఓటర్లను కోరారు.