మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనం బోల్తా పడడంతో వెంకట నరసమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో పదిమందికి గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న బాటసారులు గమనించి 108 వాహనానికి సమాచారమందించారు. గాయపడిన వారిని వెంటనే మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.