బ్రిటీష్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ట్రయంప్ విపణిలోకి సరికొత్త మోటార్ సైకిల్ను ఆవిష్కరించింది. ట్రయంప్ ట్రైడెంట్ 660 పేరిట భారత్లో విడుదల చేసిన బైక్ ధర రూ.6.95 లక్షలు(ఎక్స్ షోరూం)గా నిర్ణయించారు. ట్రయంప్ ట్రిపుల్ ఇంజిన్ రోడ్స్టర్ రేంజ్లో ట్రైడెంట్ ఎంట్రీ లెవల్ మోడల్ మాత్రమే కాదు, కంపెనీ మోటార్సైకిళ్ల లైనప్లో అద్భుతమైన మోడల్ ఇదే. దేశవ్యాప్తంగా అన్ని ట్రయంప్ షోరూంలలో కొత్త ట్రైడెంట్ 660 బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రెండేండ్ల పాటు అన్లిమిటెడ్ మైలేజ్ వారంటీతో వస్తుంది. సింపుల్, సరికొత్త డిజైన్, అత్యాధునికి ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, డిజిటల్ ఇన్స్ట్రమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్న బైక్లో 660 సీసీ, ట్రిపుల్ సిలిండర్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్బాక్స్ ఇందులో ఉన్నాయి.