హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఏఐటీఏ చాంపియన్షిప్లో తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ త్రిశాంత్ రెడ్డి విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో త్రిశాంత్ 1-6, 6-3, 6-0 తేడాతో తిరుమురుగన్(తమిళనాడు)పై విజయం సాధించాడు. తొలి సెట్ను చేజార్చుకున్న త్రిశాంత్..మిగిలిన రెండు సెట్లలో అద్భుత పోరాట పటిమతో మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్ తుది పోరులో హర్షిణి విశ్వనాథ్ 6-7(7-9), 6-3, 6-4 తేడాతో లక్ష్మి సిరి(హైదరాబాద్)పై గెలిచి టైటిల్ ఒడిసిపట్టుకుంది.