హైదరాబాద్: పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ పార్లమెంట్కు సైకిల్పై వచ్చారు. గత కొన్ని నెలల నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అనేక నగరాల్లో ప్రస్తుతం లీటర పెట్రోల్ ధర వంద రూపాయాలు దాటింది. 61 సౌత్ అవెన్యూ నుంచి తృణమూల్ ఎంపీలు సైకిల్పై పార్లమెంట్కు వచ్చారు. నూతన రైతుల చట్టాలపై చర్చ చేపట్టాలని ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ గిల్, మనీష్ తివారీలు ఈ తీర్మానం ఇచ్చినవారిలో ఉన్నారు. సీపీఎం ఎంపీలు కూడా రైతుల నిరసనపై చర్చ చేపట్టాలని నోటీసులు ఇచ్చారు. సీపీఎం ఎంపీ కరీమ్, వీ శివదాసన్.. 267 రూల్ కింద నోటీసు ఇచ్చారు.