చిక్కడపల్లి :రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా నియమితులైన వకుళా భరణం కృష్ణమోహన్ను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మంగళవారం ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ కమిషన్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వకుళాభరణం ను ప్రభుత్వ కమిషన్ చైర్మన్గా నియమించడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హౌస్ స్ఫెడ్ డైరెక్టర్ ఎ.కిషన్ రావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డి, ఎ.కిషన్ రావు,నాగభూషణం, ముచ్చకుర్తి ప్రభాకర్, టీవీరాజు, జనార్ధన్,రామ్చందర్, విద్యాసాగర్, కూరగాయల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సగర మహాసభ ఆధ్వర్యంలో….
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా నియమితులైన వకుళాభరణం కృష్ణమోహన్ను మంగళవారం అఖిల భారత సగర మహాసభ అధ్యక్షుడు విజయేంద్ర సాగర్, కోశాధికారి సి.పార్థసారథిలు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా విజయేంద్ర సాగర్, పార్థసారథిలు మాట్లాడుతూ సగరులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాసభ నగర కార్యదర్శి రాజశేఖర్ సాగర్, రాజేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. .