ఉస్మానియా యూనివర్సిటీ : ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ హెచ్. వెంకటేశ్వర్లు తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ను సోమవారం మర్యాద పూర్వ కంగా కలిశారు. ప్రొఫెసర్ హెచ్. వెంకటేశ్వర్లు ఓయూలోనే విద్యాభ్యాసం చేయడంతో పాటు ఇక్కడే సుదీర్ఘకాలం పాటు ప్రొఫెసర్గా సేవలందించి, పదవీ విరమణ చేయడం విశేషం.
అట్టాహాసంగా నిర్వహించిన ఓయూ సెంటెనరీ వేడుకలకు ఆయన స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించారు. సమావేశంలో రెండు యూనివర్సిటీలు విద్య, పరిశోధన విషయంలో పర స్పరం సహకరించుకోవడంలో సాధ్యాసాధ్యాలపై చర్చించు కున్నారు. అనంతరం ప్రొఫెసర్ వెంకటేశ్వర్లును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మెన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.