భువనేశ్వర్ : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ పోలీసు స్టేషన్పై గిరిజనులు సోమవారం దాడి చేశారు. కత్తులు, కొడవళ్లు, కర్రలతో పోలీసు స్టేషన్పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. పోలీసు స్టేషన్లోని వాహనాలను, సామాగ్రిని ధ్వంసం చేశారు. గిరిజనులను చూసి పోలీసులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఏవోబీలో గంజాయి సాగు చేస్తున్నారని కొన్నాళ్లుగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గంజాయి పేరుతో స్థానికులను ఇబ్బంది పెట్టడమే కాకుండా, మహిళలను కూడా వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో పోలీసులపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.