హైదరాబాద్, అక్టోబర్ 2 : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో గిరిజన నాయకులు సన్మానించారు. సెప్టెంబర్ 17వ తేదీన ఆదివాసీ, లంబాడాల ఆత్మగౌరవ భవనాలు ప్రారంభోత్సవం.. రిజర్వేషన్లు కూడా 10శాతానికి పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. వారు మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజనులు అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ వెంటే తామంతా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జి.సి.సి. మాజీ చైర్మన్ గాంధీ నాయక్, గిరిజన జేఏసీ నేత దరావత్ రాజేశ్ నాయక్, భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్, బొమ్మకల్ ఎంపీటీసీ రవి నాయక్ తదితరులు ఉన్నారు.