నార్నూర్ : దండారీ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేయడంతో ప్రజాప్రతినిధులు,ఆదివాసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం మండలంలోని బలాన్పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాయిసెంటర్ జిల్లా సార్మెడి దుర్గుపటేల్ మాట్లాడారు.. ఆదివాసీలు నిర్వహించే దండారీ పండుగను గుర్తించి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేయడం హర్షనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామని తెలిపారు.
దండారీ ఉత్సవాలకు నిధులు మంజూరు చేసేలా కృషి చేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి,ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెస్రం రూప్దేవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెస్రం హన్మంత్రావ్, ఇంద్రవెల్లి మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు యుర్వేత రూప్దేవ్, బలాన్పూర్ సార్మెడి మడావి మాన్కుపటేల్, సర్పంచులు ఆత్రం పరమేశ్వర్, మడావి ముక్తారూప్దేవ్, సుర్పం నాగోరావ్, కోవా మారుతి,మెస్రం రవీందర్,మెస్రం రాము,కోవా భీంరావ్ తదితరులున్నారు.