ఎల్లారెడ్డిపేట : గిరిపుత్రులకు ఆరాధ్యుడిగా సీఎం కేసీఆర్ చిరకాలం నిలిచిపోతారని బంజారా సంఘం జిల్లా నాయకుడు అజ్మీరారాజునాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మద్యం షాపుల్లో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని, పోడు భూముల సమస్య పరిష్కారానికి కమిటీ వేయడాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి బంజారా సంఘం నాయకులు క్షీరాభిషేకం చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్లు భూక్యాశంకర్నాయక్, గుగులోత్ పెంటయ్యనాయక్, భూక్యా ప్రభునాయక్, నాయకులు అజ్మీరాతిరుపతినాయక్, సీత్యానాయక్, కల్యాణ్నాయక్, ప్రకాశ్నాయక్, యశ్వంత్నాయక్ పాల్గొన్నారు.