వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ శివారులో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న దంపతులు తాటికాయల సాయిలు (68), తాటికాయల ఎల్లమ్మ (55) పురుగుల మందు తాగారు. ఎల్లమ్మ అక్కడికక్కడే చనిపోగా సాయిలు చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది.
మృతులు పొరుగున ఉన్న జఫర్గడ్ మండలం సాగరం గ్రామానికి చెందినవారని తెలిసింది. వర్ధన్నపేట పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
నిజామాబాద్ జిల్లాలో దారుణం..నీటిగుంతలో రెండు మృత దేహాలు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Space Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
OBC Bill: కోటాపై సీలింగ్ను ఎత్తివేయండి : అధిర్ రంజన్ చౌదరీ