అమరావతి : దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లిన హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు అస్వస్థతతో మృతిచెందాడు. ఇవాళ రూ. 500 దర్శన క్యూలైన్లో నిల బడ్డ హైదరాబాద్ వాసి మూర్తి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అక్కడే కుప్పకూలాడు. ఆలయ సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు.