అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కనేకల్ మండలం ఉడేగోళంలో విద్యుదాఘానికి గురై ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. పొలం పనులకు వెళ్లిన వారు మోటర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్కు గురయ్యారు. దీంతో రమేశ్, దేవేంద్ర అనే ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను చూసి బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.