హైదరాబాద్ : హజ్రత్ అలీ వర్ధంతి వేడుకల నేపథ్యంలో శుక్రవారం పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. చార్మినార్ నుంచి కాలీ కబార్ (ఎంజీబీఎస్ ఎగ్జిట్ గేట్) వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మార్గంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాలను దారి మళ్లించనున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీతో పాటు అన్ని ప్రయివేటు వాహనాలకు వర్తిస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.