సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): లాల్దర్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా పాత నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాతనగరంలో ఆదివారం బోనాలు, సోమవారం ఘటాల ఉరేగింపు సందర్భంగా ర్యాలీలు కొనసాగనున్నాయి.
ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. చార్మినార్, మీర్చౌక్, ఫలక్నుమా, బహుదూర్పూర ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ను ఇతర రూట్లలోకి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.