హైదరాబాద్ : ఈ నెల 9న హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. మొహర్రం సందర్భంగా ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మొహర్రం సందర్భంగా బీబీకా అలావా నుంచి చాదర్ఘాట్ వరకు యాత్ర సాగనున్నది. ఈ క్రమంలో బీబీకా అలావా నుంచి సునర్గల్లీ వైపు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని పేర్కొన్నారు. డబీర్పూరా దర్వాజా – గంగానగర్నాలా- యాకత్పురా మీదుగా, జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు అఫ్జల్గంజ్ వైపు మళ్లించనున్నట్లు వివరించారు.