హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం రాజ్భవన్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొనప్ప ఐలాండ్(రాజీవ్ గాంధీ విగ్రహాం) నుంచి వీవీ విగ్రహాం జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. మొనప్ప ఐలాండ్, వీవీ విగ్రహాం జంక్షన్, పంజాగుట్ట, రాజ్భవన్ క్వార్టర్స్ రోడ్డు(మెట్రో రెసిడెన్సీ) మార్గంలో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
-గేట్-3 నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వరకు జడ్జీలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాహనాలు
-దిల్ఖుష గెస్ట్ హౌస్లో మీడియా వాహనాలు
-ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్లో వీఐపీ, గవర్నమెంట్ అధికారుల వాహనాలు
-మెట్రో రెసిడెన్సీ టూ నాసర్ స్కూల్ లైన్లో సింగిల్ లైన్ పార్కింగ్
-లేక్ వ్యూ నుంచి వీవీ విగ్రహాం (లెక్వ్యూ గెస్ట్ హౌస్ ఎదురులైన్) వరకు సింగిల్ లైన్ పార్కింగ్ ఉంటుందని వివరించారు.