మల్కాజిగిరి, నవంబర్ 30: కల్వర్ట్ విస్తరణతో ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్, వెస్ట్ వెంకటాపురం మెయిన్ రోడ్డులో రూ.1.5కోట్లతో కల్వర్ట్ విస్తరణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వర్ట్ చిన్నగా ఉండటంతో ప్రతి రోజు ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని అన్నారు. కల్వర్ట్ విస్తరణ కోసం ప్రభుత్వానికి నివేదికలు అందజేయగా.. రూ.1.50కో ట్లను మంజూరు చేసిందని అన్నారు. కల్వర్ట్ విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో డీఈ కార్తీక్, ఏఈ అరుణ్, కార్పొరేటర్ సబితాకి శోర్, అనిల్కిశోర్, టీవీ భాస్కర్, ఈఎస్ లక్ష్మణ్, మల్లేశ్ గౌడ్, శివ, మోసిన్, జనార్దన్, సురేశ్, సుదేశ్, అరుణ్గౌడ్, విశాల్, సతీశ్, లోకేశ్, ప్రకాశ్గౌడ్, సాయికుమార్, పద్మావతి, ఉదయ్ పాల్గొన్నారు.