హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అరగంట వ్యవధిలోనే ఐదు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. కుండపోత వర్షానికి రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో రెండుగంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ తెలిపారు.
మెహదీపట్నం, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, ఎన్ఎండీసీ నుంచి మాసబ్ట్యాంక్ వరకు భారీ వాన కారణంగా ట్రాఫిక్ నమ్మెదిగా కదులుతోందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులు గమ్యస్థానాలను చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. మరో వైపు భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.