న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ)లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ పోస్టు లభర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 25 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 19
ఇందులో ఎలక్ట్రిషియన్ 10, ప్లంబర్ 2, ఫిట్టర్ 2, సెక్రటేరియట్ అసిస్టెంట్ 4, కార్పెంటర్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: మే 25
వెబ్సైట్: https://apprenticeshipindia.org
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి