పెద్దపల్లి : ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తి దుర్మరణం చెందగా.. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంథని రోడ్డులో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు హుటాహుటిన కరీంనగర్ జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.