న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యమే కాదు, నీటి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతున్నది. నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను నదుల్లోకి వదులుతుండటంతో ఆయా నదుల్లో నీరంతా కలుషితమై పోతున్నది. పరిశ్రమల నుంచి వచ్చి చేరే విష రసాయనాల కారణంగా నదుల్లోని నీటి ఉపరితలంపై తెల్లని విషపు నురగలు పేరుకుపోతున్నాయి. ఢిల్లీలో యుమునా నదిపై కూడా పలుచోట్ల విషపు నురగలు పేరుకుపోయాయి. కలింది కుంజ్ ఏరియాలో నీటిపై విషపు నురుగలకు సంబంధించిన దృశ్యాలను కింది చిత్రాల్లో చూడవచ్చు.