అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 20 లక్షలు దాటాయి. ఇవాళ కొత్తగా 1,435 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,695 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆరుగురు మరణించారు. ఏపీలో ఇవాళ్టివరకు మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20,00,038కి పెరిగింది. వీరిలో మొత్తం 19,70,864 మంది కోలుకున్నారు. ఇంకా 15,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 13,702కు చేరాయి. శుక్రవారం 69,173 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.