ముంబై, జూన్ 10: గతకొద్దిరోజులుగా రికార్డు స్థాయిలను తాకిన స్టాక్ మార్కెట్లు ఇటీవల కాస్త పైకి, కిందకు అవుతున్నాయి. ఈరోజు దేశీయంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కాస్త పెరగండంతో సెన్సెక్స్ , నిఫ్టీ లు లాభాల్లో కనిపించాయి. దీంతో సెన్సెక్స్ 52,143.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,198.64 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,957.92 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.37శాతం అంటే191.78 పాయింట్లు ఎగిసి 52,133.42 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 15,692.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,721.05 గరిష్టాన్ని, 15,648.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 0.41శాతం 64.20పాయింట్లు నష్టపోయి 15,699.55 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 3.52 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.56 శాతం, జే ఎస్ డబ్ల్యూ స్టీల్ 2.06 శాతం, విప్రో 1.84 శాతం, టెక్ మహీంద్రా 1.71 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ 1.29 శాతం, బజాజ్ ఆటో 1.05 శాతం, యూపీఎల్ 0.67 శాతం, ఐచర్ మోటార్స్ 0.55 శాతం, అదానీ పోర్ట్స్ 0.53 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ ఉన్నాయి.