తెలుగు సినీ నటుడు రాజబాబు(64) అనారోగ్య సమస్యలతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా నరసాపురపేటలో 1957 జూన్ 13న రాజబాబు జన్మించారు. రంగస్థల కళాకారుడిగా మంచి పేరుతెచ్చుకున్న ఆయన ‘ఊరికి మొనగాడు’ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సింధూరం, మురారి, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కల్యాణ వైభోగమే, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేనుతో పాటు అరవైకిపైగా చిత్రాల్లో సహాయనటుడిగా కనిపించారు. విలక్షణ డైలాగ్ డెలివరీతో వైవిధ్యతను చాటుకున్నారు. సినిమాలతో పాటు వసంతకోకిల, అభిషేకం, మనసు మమతతో పాటు పలు ధారావాహికల్లో నటించి మెప్పించారు. రాజబాబు మరణంతో తెలుగు చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.