పాఠశాల విద్య మాతృభాషలో కొనసాగాలని, బడీడు బాలబాలికలు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని, పాఠశాల భవనాలు, విద్యాసంస్థలు వారిని ఆకర్షించేలా ఉండాలని చెప్పి, అందుకోసం కృషిచేశారు.దృశ్య శ్రవణ మాధ్యమాల బోధనోపకరణాలను ఉపయోగించి కృత్యాత్మక బోధన కొనసాగాలని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న బాలబాలికల్లో జాతీయ సమైక్యత, జాతీయ భావన పెంపొందించేందుకు నవోదయ విద్యా సంఘటన్ను ఏర్పాటుచేశారు. జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల పేరుతో గురుకుల విద్యాసంస్థలను ప్రారంభించారు. దేశంలోని రాష్ర్టేతర భాషలను విద్యార్థులు నేర్చుకునేలా, కలిసి జీవించేలా ప్రోత్సహించారు. దేశంలో, రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలతోపాటు, వేల గురుకుల విద్యాలయాల రూపకల్పనకు, స్థాపనకు పీవీయే కారణం.
పాఠశాల విద్య మాతృభాషలో కొనసాగాలని, బడీడు బాలబాలికలు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని, పాఠశాల భవనాలు, విద్యాసంస్థలు వారిని ఆకర్షించేలా ఉండాలని చెప్పి, అందు కోసం కృషిచేశారు. దృశ్య శ్రవణ మాధ్యమాల బోధనోపకరణాలను ఉపయోగించి కృత్యాత్మక బోధన కొనసాగాలని చెప్పారు. కనీస అభ్యసనా సామర్థ్యాలు బాలబాలికల్లో తరగతుల స్థాయి, శారీరక స్థాయిలకు అనుగుణంగా పాఠశాలల్లో పెంపొందించాలని ఉద్బోధించారు. బాలబాలికలందరికీ తాగునీటి సదుపాయాలు, మూత్రశాలలతోపాటు కనీస వసతులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. 7, 10, 12 తరగతులకే వార్షిక బోర్డు పరీక్షలు నిర్వహించాలని, మిగతా తరగతుల్లో విద్యార్థుల హాజరు ప్రాతిపదికనే ఉన్నత తరగతులకు స్థాయోన్నతి (ప్రమోట్) చేయాలని చెప్పారు. డిటెన్షన్ పద్ధతిని తొలగించటం వల్లే దేశంలో బాలబాలికల్లో అక్షరాస్యత శాతం పెంపొందుతున్నది. ఇదంతా పీవీ విద్యా సంస్కరణల వల్ల సాధ్యమైందని చెప్పొచ్చు.
ప్రాథమిక విద్యాస్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన, ఉన్నత తరగతుల్లో త్రిభాషా సూత్రం అమలు, తద్వారా మాతృభాష, జాతీయభాష, అంతర్జాతీయ భాష (ఇంగ్లిష్) విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందని పీవీ తెలిపారు. గ్రామీణులకు దూరవిద్య ద్వారా ఉన్నత విద్యా సౌకర్యాలను కల్పించాలని ఓపెన్ స్కూల్స్, ఓపెన్ యూనివర్సిటీల స్థాపన ద్వారా విద్యకు దూరమైన ప్రతి పౌరునికీ విజ్ఞానార్జన, విద్యార్జన పొందే అవకాశం కల్పించాలని కృషిచేశారు. ప్రజలందరికీ సమాన విద్యావకాశాలు లభించాలన్నది ఆయన ఉన్నత ఆశయం.
తెలంగాణ బిడ్డ పీవీ చొరవతో రూపొందిన జాతీయ విద్యా విధానం అమలు వల్ల, విద్యా సౌకర్యాల వల్లే నేడు గ్రామీణ విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాభివృద్ధిలో అంతర్జాతీయ స్థాయిలో పలు నూతన ఆవిష్కరణలను మన విద్యార్థులు అందించటం మనం గర్వించదగింది. మన పీవీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులుగా, ప్రధానిగా దేశానికి అందించిన సేవలు విశిష్టమైనవి. దేశ ఆర్థికాభివృద్ధికి ఆయన చర్యలు ఎంతగానో తోడ్పాటునందించాయనటంలో సందేహం లేదు. మన పీవీ అం దరికీ ఆదర్శప్రాయుడు. నేటితరం సైతం పీవీ ఆదర్శభావాలను, సేవాతత్పరతను అలవర్చుకొని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది.
డాక్టర్ ,అనభేరి రాజేశ్వరరావు