ముంబై, జూన్ 14 : స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ప్రారంభమవడంతో సూచీలు నష్టాల్లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ 52,492.34 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,542.66 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,936.31 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,791.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,791.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,606.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ -312.51 (0.60%) నష్టపోయి 52,162.25 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 108.20 (0.68%) పాయింట్లు నష్టపోయి 15,684.70 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
ఇవాళ టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ 1.25 శాతం, దివిస్ ల్యాబ్స్ 0.73 శాతం, విప్రో 0.76 శాతం, ఇన్ఫోసిస్ 0.59 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.56 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 14.43 శాతం, కోల్ ఇండియా 2.43 శాతం, ఎస్బీఐ 1.90 శాతం, హెచ్డీఎఫ్సీ 1.70 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.53 శాతం నష్టపోయాయి. నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.