ముంబై,జూన్ 30: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తుండడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 278 పాయింట్లు పెరిగి 52,827 వద్ద కొనసాగుతున్నది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 15,828 వద్ద ట్రేడవుతున్నది. ఆసియా మార్కెట్లు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి.
రిలయన్స్,ఇన్ఫోసిస్,మారుతీ,టీసీఎస్ వంటి బడా కంపెనీల షేర్లు రాణిస్తుండడం కారణంగా సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.టాప్ గెయినర్స్ లిస్ట్ లో…కోటక్ మహీంద్ర,ఇన్ఫోసిస్,టాటా స్టీల్, రిలయన్స్, టెక్ మహీంద్ర,హెచ్డీఎఫ్సీ,టైటాన్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాప్ లూసర్స్ లిస్ట్ లో… ఎన్టీపీసీ,పవర్గ్రిడ్,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.