ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇది సూచీల కుదుపుకు కారణమైంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతోసెన్సెక్స్ నేడు 51,128.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,282.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,891.66 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 97.70 (0.19%) పాయింట్లు ఎగిసి 51,115.22 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ 15,323.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,384.55 వద్ద గరిష్టాన్ని, 15,272.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 36.40 (0.24%) పాయింట్లు లాభపడి 15,337.85 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో నేటి టాప్ గెయినర్స్ జాబితాలో శ్రీసిమెంట్స్ 3.65 శాతం, ఎస్బీఐ 2.82 శాతం, విప్రో 2.59 శాతం, కొటక్ మహీంద్రా 2.10 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.07 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో హెచ్డీఫ్సి 2.29 శాతం, ఐవోసీ 1.56 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.54 శాతం, ఓఎన్జీసీ 1.32 శాతం, hul 1.17 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో HDFC, SBI, టాటా స్టీల్, రిలయన్స్, BPCL ఉన్నాయి.