ముంబై, జూన్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 52,122.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,523.88 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,099.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,648.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,769.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,644.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.32శాతం అంటే165.44 పాయింట్లు నష్టపోయి 52,339.73 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 0.084శాతం అంటే13.30 పాయింట్లు నష్టపోయి 15,754.25 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. దీంతో టాప్ గెయినర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్స్ 1.66 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.28 శాతం, శ్రీసిమెంట్స్ 1.03 శాతం, నెస్ట్లే 1.08 శాతం, హెచ్ డీఫ్సీ లైఫ్ 0.90 శాతం లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 7.22 శాతం, టాటా స్టీల్ 3.13 శాతం, కోల్ ఇండియా 1.90 శాతం, హీరో మోటో కార్ప్ 1.45 శాతం, ఎన్టీపీసీ 1.38 శాతం నష్టపోయాయి.