ముంబై ,జూలై : స్టాక్ మార్కెట్ సూచీలుఈరోజు కూడా నష్టాలతో ముగిశాయి. ప్రారంభ సెషన్ నుంచి సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల్లో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 52,013 వద్ద, నిఫ్టీ 15,578 వద్ద కనిష్టాన్ని తాకాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెన్స్ 354 పాయింట్ల నష్టంతో 52,198 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 120 పాయింట్లు నష్టపోయి 15,632 వద్ద ముగిసింది.