ముంబై, జూన్ 8: సోమవారం లాభాల్లో ముగిసిన దేశీయస్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లో మొదలయ్యాయి. దేశీయంగా కరోనా ఉద్ధృతితగ్గుముఖంపట్టడం,వ్యాక్సినేషన్ ప్రక్రియపుంజుకోవడం,అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు వంటి అంశాలు స్టాక్ మార్కెట్ల లాభాలకు కారణమయ్యాయి. ఆసియా మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాలకు స్వీకరణకు మొగ్గుచూపుతున్నట్లుగా కనిపిస్తోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీ, ఆటో స్టాక్స్ లాభాల్లో ఉండగా, బ్యాంకింగ్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మెటల్, పీఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్ దాదాపు రెండు శాతం, ఐటీ సూచీ ఒక శాతం లాభపడింది.