ముంబై , ఆగస్టు: ఈ వారంలో ప్రారంభం నుంచి వరుసగా లాభాల బాటలో కొనసాగుతున్నాయి సూచీలు. ఇవాళ కూడా సూచీలు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 425 పాయింట్ల లాభంతో 54,249 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు లాభపడి 16,249 వద్ద కొనసాగుతున్నాయి. తొలిసారి 54 వేల మార్క్ను దాటి సెన్సెక్స్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది.