ముంబై ,జూలై :స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోపాటు అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు ఏషియా-పసిఫిక్ మార్కెట్ల నష్టాలు తదితర అంశాలు దేశీయ సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ప్రారంభ సెషన్ లో సూచీలు సెన్సెక్స్ 209 పాయింట్ల నష్టంతో 52 వేల 369 వద్ద.. నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 15వేల 678 వద్ద కదలాడుతున్నాయి.