ముంబై , జూలై : ఇవాళ ప్రారంభ సెషన్ లో భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరిదాకా లాభాల్లోనే కొనసాగుతూ వచ్చాయి. భారీ లాభాలతో ముగిశాయి.సెన్సెక్స్ 638 పాయింట్లు ఎగసి 52,837 వద్ద, నిఫ్టీ 191 పాయింట్ల మేర ఎగసి 15,824 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు 44 కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెల్లడించాయి. దీంతో సూచీలు మరింతగా దూసుకెళ్లాయి.