ముంబై, జూలై : ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,747 వద్ద, 405 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52,604 వద్ద కొనసాగుతున్నాయి. ఇవాళ 44 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈనేపథ్యంలో సూచీలు మరింతగా దూసుకుపోయే అవకాశం ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు తాజా సెషన్ లో లాభాలతో ప్రారంభమయ్యాయి.