ముంబై,జూలై:స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 52,625వద్ద,నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి15,770 వద్ద కదలాడుతున్నది. అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపుతో పాటు ఆసియా మార్కెట్ల పరిణామాలతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.