ముంబై,జూలై :సెన్సెక్స్ ఇటీవల 53,000 మార్కును క్రాస్ చేసి సరికొత్త గరిష్టాన్ని తాకింది. కానీ రెండు రోజులుగా క్షీణిస్తోంది. ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. నిన్న500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్,ఈరోజు ప్రారంభ సెషన్లో మరో 200 పాయింట్ల వరకూ పతనమైంది. ఏడాదిన్నర క్రితం కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. సెకండ్ వేవ్తో మరోసారి ఆర్థిక వ్యవస్థ మరింతగా కుదేలైంది.