ముంబై,జూన్ 30:గత రెండు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న సూచీలు బుధవారం సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో 200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్129 పాయింట్ల లాభంతో 52,648 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు ఎగిసి15,790 వద్ద ట్రేడవుతున్నది.