హైదరాబాద్ ,జూన్ 28:పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యుడికి పెను భారంగా మారుతున్నది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.98.46గా ఉండగా,డీజిల్ రూ.88.90వద్ద ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.104.56 వద్ద ఉండగా డీజిల్ రూ.96.42వద్ద కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 99.49 గా ఉండగా,డీజిల్ ధర రూ.93.46గానమోదైంది. హైదరాబాద్లో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.102.32 గా ఉండగా,డీజిల్ ధర రూ. 96.90 గా నమోదైంది. తెలంగాణలో మరో ముఖ్య పట్టణమైన కరీంనగర్లో లీటర్ పెట్రోల్ రూ. 102.20 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ ధర రూ. 96.77గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 105.09 గా ఉండగా,డీజిల్ రూ.99.02 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.41 గా ఉండగా,డీజిల్ రూ. 97.41గా నమోదైంది.