కావలసిన పదార్థాలు
బియ్యం: ఒక కప్పు, చక్కెర: ఒక కప్పు, చిక్కటి పాలు: నాలుగు కప్పులు, నెయ్యి: పావు కప్పు, బాదం, జీడిపప్పు: పావు కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్
తయారీ విధానం
బియ్యం కడిగి, గంటపాటు నానబెట్టుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక బాదం, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో పాలు పోసి వేడి చెయ్యాలి. పాలు మరుగుతుంటే నానిన బియ్యం వేసి ఉడికించాలి. అన్నం దగ్గర పడుతుంటే చక్కెర, యాలకుల పొడి వేసి కలపాలి. చివరగా వేయించిన బాదం, జీడిపప్పు వేసి కలుపుకొంటే పాయసాన్నం సిద్ధం.