బాలాసోర్: భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ నూతన వెర్షన్ను ఇవాళ టెస్ట్ చేసింది. ఒడిశా తీరంలోని బాలాసోర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణి పరీక్ష నిర్వహించారు. ఈ విషయాన్ని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైల్కు తాజాగా కొన్ని నూతన సాంకేతికతలను జోడించారు.
ఆ నూతన సాంకేతికతలు విజయవంతంగా పనిచేస్తాయా.. లేదా..? అనేది నిర్ధారణ చేసుకోవడం కోసం ఇవాళ పరీక్షించి చూశారు. ఈ పరీక్ష విజయవంతమైంది. నూతన సాంకేతికతలు సమర్థంగా పనిచేస్తున్నాయని రుజువైంది. సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంగల ఈ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను భారత్కు చెందిన డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్పీవోఎం కలిసి అభివృద్ధి చేశాయి.
ఈ క్షిపణులను భూమి మీద నుంచి, ఆకాశం పైనుంచి, సముద్రం నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణులను యాంటీషిప్, లాండ్ ఎటాక్ ఇలా రెండు పాత్రలు పోషించేలా రెండు రకాలుగా డిజైన్ చేశారు. ఈ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ఇప్పటికే ఇండియన్ నేవీలో, ఇండియన్ ఆర్మీలో సమర్థంగా వినియోగిస్తున్నారని డీఆర్డీవో తెలిపింది.