ముంబై, మే 5: బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల రూ.48వేల స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ మంగళవారం రూ.47,000 దిగువకు వచ్చింది. ఈరోజు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నది. వెండి ఫ్యూచర్ రూ.69 వేలకు పైన కదలాడుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ పెరిగినప్పటికీ అతి స్వల్పం మాత్రమే. ఔన్స్ గోల్డ్ 1775 డాలర్ల వద్ద ఉంది. వెండి 26.500 డాలర్ల దిగువన ఉంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే బంగారం రూ.9300 తక్కువగా ఉంది. బంగారం రూ.47,300 వద్ద స్థిరంగా ఉండొచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ఇవాళ మధ్యాహ్నం సెషన్లో 0.04శాతం అంటే రూ.19.00 పెరిగి రూ.46890.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,979.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,046.00 గరిష్టాన్ని, రూ.46,836.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.05శాతం అంటే రూ.23.00పెరిగి రూ.47220.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,338.00 వద్ద ప్రారంభమై, రూ.47,430.00 గరిష్టాన్ని, రూ.47,175.00 వద్ద కనిష్టాన్ని తాకింది.