సుల్తాన్బజార్: టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ఏడవ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్రికెట్ టోర్నీలో గాంధీ మెడికల్ కాలేజీ(జీఎంసీ) విజేతగా నిలిచింది. శుక్రవారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో జీఎంసీ ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ యూత్ ఫోర్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన యూత్ఫోర్స్ టీమ్ నిర్ణీత 12 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. తదనంతరం లక్ష్యఛేదనకు దిగిన జీఎంసీ మరో మూడు బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. మరోవైపు క్యారమ్స్ పురుషుల సింగిల్స్లో ఉస్మాన్అలీఖాన్, రన్నరప్గా శ్రీకాంత్, డబుల్స్ విజేతగా శ్రీకాంత్, విక్రమ్ కుమార్ విజేతలుగా నిలిచారు. పోటీల ముగింపు కార్యక్రమానికి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండేందుకు గత ఏడేండ్లుగా ముజీబ్ హుస్సేని నేతృత్వంలో క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, కార్యదర్శి విక్రమ్ కుమార్, ఉపాధ్యక్షులు రాజ్కుమార్, ఉమర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.