హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): కొంతకాలంగా నిలిచిపోయిన కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని టీఎన్జీవో నేతలు సీఎస్ సోమేశ్కుమార్ను కోరారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ల నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో సీఎస్ను కలిసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులందరికీ 24శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని, ఏపీలో పనిచేస్తున్న 123 మంది రాష్ట్ర ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని నేతలు కోరారు.
సీఎస్ అధ్యక్షత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాలన్నారు. పలు ఉద్యోగ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. ఆయా వినతుల పట్ల సీఎస్ సానుకూలంగా స్పందించారని రాజేందర్, ప్రతాప్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, ముజీబ్ హుస్సేని, శ్రీరామ్, లక్ష్మణ్, రవిప్రకాశ్, పరమేశ్వర్, విక్రమ్రెడ్డి తదితరులు ఉన్నారు.