హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): టీఎన్జీవో నీటిపారుదలశాఖ విభాగం నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మారం జగదీశ్, కార్యదర్శిగా నజీర్ అహ్మద్, కోశాధికారిగా పీ శ్రీనివాస్ ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి కస్తూరి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం నాంపల్లిలోని టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన సంఘం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా కృషిచేయాలని నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు. ఉద్యోగులపట్ల సీఎం కేసీఆర్ సానుకూల ధోరణి అవలంబిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, నేతలు రామినేని శ్రీనివాస్, ఏ కిషన్, డీ నరేందర్, రవిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.