చెన్నై : కొనసాగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న అమలులోకి తీసుకువచ్చిన నైట్కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయని పేర్కొంది. మే 2న రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు, పార్టీ కార్య నిర్వాహకులు, అభ్యర్థులు, ఏజెంట్లు, ఆహారం సరఫరాదారుల కదలికలపై ఎలాంటి పరిమితులు ఉండవని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల మధ్య కర్ఫ్యూ ఎలాంటి సడలింపులు లేకుండా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతించిన విమానాలు మినహా మిగతా ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. మాంసం మార్కెట్లు శనివారం మూతపడనున్నాయి. ఎస్ఎస్సీ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, టీఎన్పీఎస్సీ, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు చెల్లుబాటయ్యే అడ్మిట్ కార్డులపై ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
ఇవి కూడా చదవండి..