న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ అయిన టాటా మెమోరియల్ సెంటర్ (TMC)లో నర్స్, టెక్నీషియన్, అసిస్టెంట్ ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 126 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎండీ, డీఎన్బీ, బీటీ, జనరల్ నర్సింగ్ చేసినవారు ఈ పోస్టులకు భర్తీ చేసుకోవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు ముంబై, పంజాబ్లోని రీజినల్ సెంటర్లలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 126
ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ 12, రేడియాలజీ అసిస్టెంట్ 1, ఐటీ హెడ్ 1, డిస్పెన్సరీ ఇన్చార్జ్ 1, సైంటిఫిక్ ఆఫీసర్ 2, సైంటిఫిక్ అసిస్టెంట్ 1, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 1, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ 4, నర్స్ 102 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎండీ, డీఎన్బీ, బీఈ, బీటెక్, జనరల్ నర్సింగ్, ఆంకాలజీ నర్సింగ్లో డిప్లొమా చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 29
వెబ్సైట్: https://tmc.gov.in/